థానే 24.07.2023 : మణిపూర్లో మే 3న, ఇద్దరు కుకీ గిరిజన మహిళలను నగ్న స్థితిలోఉంచి దారుణంగా కొట్టి మురికివాడల్లో పడేశారు. ఇది ఓ భయానక వాతావరణం సృష్టించబడ్డాయి. ఈ ఘటన జులైలో భారతదేశంలో వెలుగులోకి వచ్చింది. దాదాపు మూడు నెలలైంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ అక్కడి పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. ఇప్పటి వరకు సుమారు 140 మంది గిరిజనులు చనిపోయారు. అయితే మణిపూర్ ఘటనపై ప్రధాని మోదీ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరోవైపు ప్రధాని దేశ విదేశాలు తిరుగుతున్నా మణిపూర్ ఎందుకు వెళ్లడం లేదు? ఇప్పటికీ ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోలేదు కాబట్టి మణిపూర్ సీఎం అసమర్థుడని స్పష్టమవుతోందని బీ.ఆర్.ఎస్ పార్టీ ప్రతినిధులు ఆరోపించారు.
బీజేపీ నేతలు మంత్రులు తప్ప ఈ దేశంలో ఎవరూ సురక్షితంగా లేరన్నారు. అందుకే ఈ ప్రభుత్వాలకు పాలించే నైతిక హక్కును కోల్పోయారని బీఆర్ఎస్ సీనియర్ నేత హేమంత్ కుమార్ బద్ది ఆక్రోశించారు.
దీంతో పాటు జిల్లా సాంగ్లీ బెడక్ గ్రామంలో 150 దళిత కుటుంబాలను అణచివేసి బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరుతో ఉన్న తోరణాన్ని (ప్రవేశ ద్వారం) ధ్వంసం చేశారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్కు విన్నవించినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అందుకే మంత్రివర్గానికి వ్యతిరేకంగా 150 కుటుంబాలు సమ్మెకు దిగాయి. ఎమ్మెల్యే సురేశ్ ఖాడే, సంరక్షక కార్మిక శాఖ మంత్రి పట్టించుకోలేదు.